తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సి.జె. దంపతులు

0
29

తిరుమల శ్రీ వారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. ఎన్.వి.రమణ దంపతులు. నిన్న గురువారం తిరుమలలో ఏకాంత సేవలో వీరు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వారి దర్శనార్థం ఆలయ మహద్వారం వద్ద కు చేరుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్. ఎన్.వి. రమణ దంపతులకు… తిరుపతి, తిరుమల దేవస్థానం ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, , టిటిడి ఈవో డా.జవహర్ రెడ్డి స్వాగతం పలికారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం వేద పండితుల ఆశీర్వాదం తో ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించు కున్నారు.. శ్రీ వారి దర్శనానంతరం రంగ నాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదాలతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.


అనంతరం సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ దంపతులు బేడీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వెంట ఏపీ హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ కె. లలిత కుమారి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర బాబు, తిరుపతి అదనపు జిల్లా జడ్జి వై.వీర్రాజు, ప్రోటోకాల్ మేజిస్ట్రేట్ పవన్ కుమార్, తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఉండగా… ఈ కార్య క్రమంలో టిటిడి అదనపు ఈవో ధర్మా రెడ్డి, సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్.పి వెంకట అప్పల నాయుడు పాల్గొన్నారు.