టార్గెట్ మెగాస్టార్ చిరంజీవినే…

టార్గెట్ మెగాస్టార్ చిరంజీవినే...

0
71

తెలుగు ఇండస్ట్రీకి చెందిన మెగాస్టార్ చిరంజీవిని రాజధాని అమరావతిరైతులు మరోసారి టార్గెట్ చేశారు…. వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా 72 రోజులుగా రాజధాని రైతులు ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే…

అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటి ఎదుట ధర్నాలుచేస్తామని అమరావతి జేఏసీ నేతలు స్పష్టం చేశారు… తాజాగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 29న ఉయదం తొమ్మిది గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఉన్న చిరంజీవి ఇంటిముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు…

మెగాస్టార్ చిరంజీవి అమరావతి రైతులకు మద్దతుగా నిలవాలని అన్నారు… కాగా ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ అలాగే టీడీపీ నేతలు అమరావతి రైతులకు మద్దతు పలికిన సంగతి తెలిసిందే…