తిరుమలలో ఉగ్రవాదుల కలకలం..!

తిరుమలలో ఉగ్రవాదుల కలకలం..!

0
48

ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడి అని ఎప్పుడైనా ఎక్కడైనా దాడులు చేసే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో తిరుమలలో కూడా ఉగ్రవాద దాడులు జరగవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. తిరుమల లోకి ఉగ్రవాదులు ప్రవేశించారన్న అనుమానంతో ఆక్టోపస్ రంగంలోకి దిగింది.

40 మంది కమాండోలు తిరుమల మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో కఠోరమైన శిక్షణ పొందిన ఈ కమాండోలు అత్యాధునిక ఆయుధాలు టెక్నాలజీ సహాయంతో సామాన్య ప్రజలకు నష్టం జరగకుండా ఉగ్రవాదులను అంతమొందించడంలో దిట్ట.తిరుమల కొండకు ఉగ్ర ముప్పు ఉందన్న నేపథ్యంలో టిటిడి వినతి మేరకు కమాండో బృందాలు ప్రస్తుతం నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి .

బృందాలుగా విడిపోయి అనుమానం గా ఉన్న ప్రతి ప్రాంతాన్ని తనిఖీ చేస్తున్నారు. ఆయుధాలు ధరించి కాళ్లకు షూస్ లేకుండా నలుపు రంగు దుస్తుల్లో తిరుగుతున్న కమాండోలను చూసేందుకు భక్తులు కూడా ఆసక్తి చూపుతున్నారు.