BREAKING: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తప్పిన పెను ప్రమాదం

The biggest risk missed for the TRS MLA

0
34

తెలంగాణ: మెదక్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. అక్కన్నపేట రైల్వే గేట్ వద్ద ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును వెంక నుంచి వచ్చిన ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టింది. కాగా  మెదక్ పర్యటన అనంతరం ఓ వివాహానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.