ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో గుడ్‌ న్యూస్‌

The Center for Government Employees is another piece of good news

0
40

రెండు రోజుల క్రితమే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని పెంచింది. తాజాగా మరో శుభవార్త ప్రకటించింది. కొంతమంది ఉద్యోగులకు వేతనాలపై ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ పెంపుతో ఉద్యోగుల జీతం పెరుగుతుంది.

ఈ ఇంక్రిమెంట్ ప్రయోజనం 7వ పే కమిషన్ పే మ్యాట్రిక్స్ కి సంబంధించి 6వ స్థాయి అధికారులకు కేటాయించారు. ఈ ర్యాంక్ ఉన్న అధికారుల జీతంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. ఈ ఇంక్రిమెంట్ ప్రయోజనం అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పోటీలలో పాల్గొనే అధికారులకు ఇస్తారు.

ఈ అధికారులను ప్రత్యేక ఇంక్రిమెంట్ కోసం ఎంపిక చేశారు. చాలా కాలంగా ఈ సమస్య రక్షణ మంత్రిత్వ శాఖతో పరిశీలనలో ఉంది. ప్రస్తుతం దీనిని మంత్రిత్వ శాఖ ఆమోదించింది. అధికారుల ప్రత్యేక ఇంక్రిమెంట్‌కు మార్గం సుగమం చేసింది.

అక్టోబర్ 21న ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్‌ను 3 శాతం పెంచుతూ పెద్ద నిర్ణయం తీసుకుంది. కానీ ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం దానిని మరోసారి 3 శాతానికి పెంచింది. ఇంతకు ముందు డియర్నెస్ అలవెన్స్ రేటు 28 శాతంగా ఉంది. ఇది 31 శాతానికి పెరిగింది. 1 కోటి మందికి పైగా కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లు ఈ పెంపుదల ప్రయోజనం పొందుతారు.