గుడ్ న్యూస్: ట్రిపుల్ ఆర్ చుట్టూ ఎంఎంటీఎస్ సేవల విస్తరణ

0
34

త్వరలోనే ట్రిపుల్ ఆర్ చుట్టూ ఎంఎంటీఎస్ సేవల విస్తరణ జరగనుంది. రీజనల్ రింగు రోడ్డు చుట్టూ ఎంఎంటీఎస్ సేవలను విస్తరించాలని బీజేపీ నేతలు చేసిన విజ్ఝప్తిపట్ల సానుకూలంగా స్పందించారు రైల్వేశాఖ మంత్రి అశ్వీనీ వైష్ణవ్. ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తే రైల్వే శాఖ అధికారులతో చర్చించి తెలంగాణ ప్రజలకు ఆమోదయోగ్యం కలిగేలా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు

రాష్ట్రంలో పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్న రైల్వే మంత్రి అశ్వీనీ వైష్ణవ్… రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, రైల్వే లైన్ల ఏర్పాటు విషయంలో రాష్ట్రానికి ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమయంలో స్వామిగౌడ్ రీజనల్ రింగు రోడ్డుకు ఎంఎంటీఎస్ సేవలను విస్తరిస్తే తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆయన బీజేపీ శ్రేణులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రీజనల్ రింగు రోడ్డుకు ఎంఎంటీఎస్ సేవలను విస్తరిస్తే తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని స్వామిగౌడ్ కోరగా స్పందించిన రైల్వే మంత్రి ట్రిపుల్ ఆర్ విస్తీర్ణం, ప్రాజెక్టు పురోగతిపై నేతలను అడిగి తెలుసుకున్నారు.

 

అక్కడే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ ‘‘తెలంగాణలో 10 జిల్లాలను కలుపుతూ 300 కిలోమీటర్ల మేరకు రీజనల్ రింగు రోడ్డును ఏర్పాటు చేయబోతున్నాం. ప్రాజెక్టు వ్యయం సమారు రూ.20 వేల కోట్లు. భూ సేకరణకయ్యే వ్యయంలో కేంద్ర రాష్ట్రాలు 50:50 శాతం వాటా భరిస్తున్నాయి. ఈ ప్రక్రియ వేగంగా జరుగుతోందని బదులిచ్చారు. ట్రిపుల్ ఆర్ రోడ్డు 100 మీటర్ల వెడల్పు ఉంటుందని తెలిపారు. స్పందించిన అశ్విని వైష్ణవ్​అందులో 30 మీటర్లు రైల్వే శాఖకు కేటాయిస్తే ట్రిపుల్ ఆర్ చుట్టూ ఎంఎంటీఎస్ సేవలను విస్తరించేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు.