బంగారం ధర ముందు రెండు రోజులు బాగానే తగ్గింది.. మళ్లీ మార్కెట్లో పెరుగుదల నమోదుచేసింది, మరి బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి ముంబై బులియన్ మార్కెట్ నుంచి మన ఏపీ తెలంగాణలో రేట్లు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. నేడు స్వల్పంగా పెరుగుదల నమోదు చేసింది బంగారం.
హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 పెరిగింది.
దీంతో రూ.49,800కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగింది. దీంతో రేటు రూ.45,650కు చేరింది, అయితే బంగారం స్వల్పంగా పెరిగితే వెండి భారీగా పెరుగుదల నమోదు చేసింది.
కేజీ వెండి రూ.700 పైకి పెరిగింది. దీంతో వెండి ధర రూ.70,700కు చేరింది.వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ నిపుణులు. ఇక రెండు నెలల తర్వాత మాత్రం బంగారం 15 శాతం తగ్గే సూచనలు ఉన్నాయి అంటున్నారు.