ఈ జిల్లాల వైసీపీ ఎమ్మెల్యే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు

ఈ జిల్లాల వైసీపీ ఎమ్మెల్యే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు

0
30

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలను చేపట్టినప్పటినుంచి రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు… ప్రభుత్వ ఫలాలు అందరికి అందాలి… అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలనే ఉద్దేశంతో ముడు రాజధానుల ప్రతిపాధన తీసుకువచ్చారు…

ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా రాజధాని రైతులు కొద్దికాలంగా ధర్నాలుచేస్తున్నారు వారికి టీడీపీ జనసేన నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నారు… రాయలసీమకు చెందిన టీడీపీమాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు రాజధానని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతున్నారు…

ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నాయకులు కూడా రాజధాని రైతులకు మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారు… అయితే వీరు చేస్తున్న ర్యాలీలకు స్పీకర్, ధర్మాన కృష్ణదాస్ వంటివారు కౌంటర్ ఇస్తున్నారు… కానీ రాయలసీమ ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మొదపడంలేదని కార్యకర్తలు వాపోతున్నారు…. కర్నూల్ హైకోర్టుకు మద్దతుగా ఎందుకు కార్యక్రమాలు చేయకున్నారని కార్యకర్తలు వాపోతున్నారు…