ఈ మూడు రాష్ట్రాల్లో విమానాలు తిరగవు తప్పక తెలుసుకోండి

ఈ మూడు రాష్ట్రాల్లో విమానాలు తిరగవు తప్పక తెలుసుకోండి

0
27

నేటి నుంచి విమానాలు మన దేశంలో తిరగనున్నాయి….కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. గత వారం ప్రకటన చేయడంతో టికెట్లు కూడా చాలా మంది చేసుకున్నారు.. వేరే స్టేట్స్ లో చిక్కుకున్న చాలా మంది, తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. అయితే దేశ వ్యాప్తంగా అన్నీ స్టేట్స్ లో విమానాలు తిరుగుతాయి అని అందరూ అనుకున్నారు.

కాని మూడు స్టేట్స్ మాత్రం విమానాలు తిప్పడానికి అంగీకరించడం లేదు, ఇప్పట్లో విమానాలు నడపడానికి విళ్లేదని కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెబుతున్నాయి. ఆ మూడు.. దేశంలోని అతిపెద్ద స్టేట్స్, అంతేకాదు అతి పెద్ద ట్రావెల్ హిస్టరీ ఉన్న స్టేట్స్.

అవే మన దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలు. తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్. ఈ మూడు స్టేట్స్ విమానాలకు అనుమతించబోమని చెబుతున్నాయి. ఇక ఈ మూడు స్టేట్స్ లో కరోనా కేసులు ఎక్కువ ఉన్నాయి, వెస్ట్ బెంగాల్ లో కాస్త తక్కువ ఉన్నా అక్కడ అంఫాన్ తుఫాన్ వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాయి…ఈ నెల 31 వరకు విమాన సర్వీసులను చెన్నైకి నడపకూడదని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.