జగన్ కు ఈ ముగ్గురే కీలకం

జగన్ కు ఈ ముగ్గురే కీలకం

0
36

ఏ రాజ‌కీయ పార్టీలో అయినా ఫైర్ బ్రాండ్ నాయ‌కులు కొంద‌రు ఉంటారు.. ముఖ్యంగా ఆ నాయ‌కుల ఫాలోయింగ్ నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది.. అలా అధికార వైసీపీలో కూడా ప‌లువురు నాయ‌కులు రాజ‌కీయంగా యాక్టీవ్ గా ఉంటున్నారు.. ఇక వైసీపీ అధినేత నేత ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా పార్టీలో వీరికే అగ్ర‌తాంబూలం ఇస్తున్నారు. పార్టీలో అలాంటి నాయ‌కుల‌కు ప్రస్తుతం జ‌గ‌న్ ఎంతో ప్ర‌యారిటీ ఇస్తున్నారు. అనునిత్యం జ‌నంలో ఉంటూ వారి సమస్యలకు పరిస్కారం దిశగా అడుగులు వేస్తున్న గుడివాడ మంత్రి కొడాలి నాని, నెల్లూరు మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్, మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి లకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని టాక్. ఇప్పుడు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీలో కీల‌క నాయ‌కులు గా ఎదుగుతున్నారు. గతంలో తెలుగుదేశం చేసే అరాచ‌కాల‌ను అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వివరిస్తున్నారు.