మూడు రాజధానులపై జేడీ లక్ష్మీనారాయణ కామెంట్స్

మూడు రాజధానులపై జేడీ లక్ష్మీనారాయణ కామెంట్స్

0
43

మూడు రాజధానులపై ఏపీ సర్కార్ నేడు కీలక నిర్ణయం తీసుకోబోతుంది… సర్కార్ తీసుకునే నిర్ణయం కోసం యాప్ రాష్ట్రం ఉత్కంఠంగా ఎదురు చూస్తోంది…. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కీలక నేత మాజీ జేడీ లక్ష్మీ నారాయణ మూడు రాజధానులపై కీలక కామెంట్స్ చేశారు…

విశాఖలో సచివాలయం ఏర్పాటు చేస్తే సచివాలయ భవనాలు వస్తాయని అన్నారు… సచివాలయ సిబ్బంది కోసం అక్కడ ఇళ్ల స్థలాలు కేటాయిస్తారు అంతకుమించి అక్కడేమి జరగదని అన్నారు… ప్రభుత్వ అఫీసులు వచ్చినంత మాత్రాన విశాఖ పట్నం అభివృద్ది చెందదని ప్రశ్నించారు…

అధికార వికేంద్రీకరణ కాదని అభివృద్ది వికేంద్రీకరణ జరగాలని జేడీ అన్నారు… అభివృద్ది చెందాల్సింది ప్రభుత్వం కాదని పరిపాలన అభివృద్ది చెందాలని అన్నారు… కాగా 2019 ఎన్నికల్లో జేడీ జనసేన పార్టీ తరపున విశాఖలో ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు..