విపక్షాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే షాకింగ్ సవాల్..!

TRS MLA shocking challenge to opposition ..!

0
28

తెలంగాణ: మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ ప్రతిపక్షాలకు షాకింగ్ సవాల్ విసిరారు. వివరాల్లోకి వెళితే..గూడూరు మండలం గాజులగట్టు శివారు పాటిమీదిగూడెంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఒక్కసారే 50 రెండు పడక గదుల ఇళ్ళను మంజూరు చేశారు. కొద్దిరోజుల కిందట ఇదే గ్రామ బొడ్రాయి మీద ప్రమాణం చేసి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే, అన్నట్టుగానే మాట నిలబెట్టుకుని 50 ఇళ్ళు మంజూరు చేసి తన కమిట్‌మెంట్‌ను నిరూపించుకున్నారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. కాంగ్రెస్ పార్టీ గల్లీలో లేదు, ఢీల్లిలో లేదని ఎద్దేవా చేశారు. మహబూబబాద్ జిల్లాలో సర్పంచ్ కు వచ్చిన ఓట్లు కూడ హుజురాబాద్ లో రాలేదని విమర్శించారు. ‘మీ ఊరు బొడ్రాయి మీద ప్రమాణం చేసి 50 డబుల్ బెడ్ రూం ఇళ్ళు కట్టిస్తానని హామీ ఇచ్చిన, ఇచ్చిన మాట ప్రకారం వారం రోజుల లోగా 50 ఇళ్ళు మంజూరీ చేసినట్లు లెటర్ పట్టుకొచ్చిన, శంకర్ నాయక్ అంటేనే మాట మీద నిలబడుతాడు’ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళకు సవాల్ విసిరుతున్నా..మీకు సిగ్గు శరం ఉంటే, మీకు లజ్జ ఉంటే, మీరు మనుషులైతే, మహబూబాబాద్ నియోజకవర్గంలో మీ హాయాంలో, మా హయాంలో జరిగిన అభివృద్దిపై చర్చకు సిద్ధమా? టైం మీరు చెప్పినా సరే, లేదా నన్ను చెప్పమన్నా సరే, మహబూబాబాద్ నెహ్రూ సెంటరా? లేక గూడూరు అంబేద్కర్ సెంటరా? నేను చర్చకు రెడీ ! మీరు సిద్దమా?’’ అని గట్టిగానే చాలేంజ్ చేశారు ఎమ్మెల్యే శంకర్ నాయక్.

తాను 50 ఎకరాలు ఆక్రమించానని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారని, తానెక్క ఆక్రమించానో చూపిస్తే ఆ యాభై ఎకరాలు వాళ్లకే రాసిస్తానని స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. బీజేపీ నేతలకు దమ్ము ధైర్యం ఉంటే తాను ఆక్రమించిన భూములు ఎక్కడో చూపించాలన్నారు. గతంలో కాంగ్రెస్ వాళ్ళు కూడ ఇలాగే ఆరోపించి, నిరూపించలేకపోయారన్నారు. తనపై ఆరోపణ చేసేటప్పుడు ఒకటికి వందసార్లు ఆలోచించుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు.