ట్రంప్ గెలిస్తే ఆ వ్యక్తి పాపులర్ ఆనంద్ మహీంద్రా సంచలన ట్వీట్

ట్రంప్ గెలిస్తే ఆ వ్యక్తి పాపులర్ ఆనంద్ మహీంద్రా సంచలన ట్వీట్

0
36

ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెక్ టు నెక్ ఫైట్ జరుగుతోంది, మరోసారి ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని ఇప్పుడు మీడియా కూడా అంటోంది, అయితే ట్రంప్, జో బిడెన్ ఇద్దరు మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరలో ఉన్నారు.

ట్రంప్ నిర్ణయాలు ఆయనకు నెగిటీవ్ అవుతాయి అని చాలా మంది అనుకున్నారు.. కాని చాలా స్టేట్స్ లో ట్రంప్ పార్టీ ముందు ఉంది. తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే ఓ వ్యక్తి పాపులర్ అవుతారని అన్నారు.

సమాజంలో చాలా అంశాలపై సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా తన ఓపినీయన్ తెలియచేస్తారు ఆనంద్ మహీంద్రా, తాజాగా అమెరికా ఎన్నిక పై చేసిన ట్వీట్ అందరిని ఆకట్టుకుంది
ట్రంప్ గెలుస్తాడని ఓ జ్యోతిష్యుడు ముందుగానే చెప్పాడని, ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా,చివరికి గెలిచేది ట్రంపే అని జోతిష్యుడు చెప్పినట్టు ఆనంద్ మహీంద్రా ట్వీట్ లో అన్నారు.

ఇప్పుడు అతను చెప్పినట్లు జరిగితే ఆ వ్యక్తి కచ్చితంగా ఫేమస్ అవుతాడు, అని తెలిపారు, ఇక ఆ జ్యోతిష్యుడు ఎవరు అనేది మాత్రం చెప్పలేదు ఆయన…ట్రంప్ జోతిష్యాన్ని మహీంద్రా ట్వీట్ చేశారు, మరి చూడాలి ఎవరు గెలుస్తారో