ట్రంప్ భారత్ పర్యటన ఇలా సాగనుంది పూర్తి షెడ్యూల్ ఇదే

ట్రంప్ భారత్ పర్యటన ఇలా సాగనుంది పూర్తి షెడ్యూల్ ఇదే

0
38

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన గురించే అందరూ చర్చించుకుంటున్నారు, రెండు రోజుల పర్యటన కోసం భారత్ కూడా చాలా ఏర్పాట్లు చేస్తోంది, స్వాగతం పలికేందుకు భారీగా మోదీ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది.

ట్రంప్ ఇక్కడ ఏం చేస్తారో.. ఏ ప్రదేశాలను సందర్శిస్తారో అని అందరూ ఒకటే చర్చ, ఈ నెల 24, 25వ తేదీల్లో భారత్ లో పర్యటిస్తున్నారు. మొత్తం మూడు దశల్లో అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీని ట్రంప్ దంపతులు సందర్శించనున్నారు.

ఈ నెల 24న ఉదయం 11 గంటలకు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ అహ్మదాబాద్ కు చేరుకుంటారు. అక్కడ మోదీ వారికి స్వాగతం పలుకుతారు.. మోదీ, ట్రంప్.. రోడ్ షో ద్వారా మొతెరా స్టేడియం చేరుకుంటారు.

ఇక్కడ సబర్మతి ఆశ్రమం దగ్గర ఆగి..15 నిమిషాలు అక్కడ గడుపుతారు. లక్షా పది వేల సీటింగ్ కెపాసిటీతో ఆధునికీకరించిన మొతెరా స్టేడియంలో జరిగే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి ఇరువురు నేతలు మధ్యాహ్నం 12.30 గంటలకు హాజరవుతారు. ఇక్కడ మోదీ ట్రంప్ ఇద్దరూ ప్రసంగం చేస్తారు.

మధ్యాహ్నం 3.30 గంటలకు ట్రంప్, మెలానియా ఆగ్రా బయల్దేరుతారు.
5 గంటలకు ఆగ్రా వస్తారు, అక్కడ నుంచి రాత్రి ఢిల్లీకి వచ్చి ఐటీసీ మౌర్యా హోటల్లో బస చేస్తారు
ఈనెల 25న ట్రంప్ దంపతులు రాష్ట్రపతి భవన్ ను సందర్శిస్తారు.
ఉదయం పది గంటలకు అక్కడ ఆహ్వనం ఉంటుంది
ఉదయం 10.45కు ట్రంప్, మెలానియా రాజ్ ఘాట్ కు చేరుకుంటారు.
అక్కడ మోదీతో కలిసి మహాత్మాగాంధీకి నివాళులు అర్పిస్తారు.

ట్రంప్.. హైదరాబాద్ హౌజ్ కు బయల్దేరుతారు.
హైదరాబాద్ హౌజ్ లో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మోదీ, ట్రంప్ మధ్య అత్యున్నత స్థాయి చర్చలు జరుగుతాయి. ఇద్దరు పలు ఒప్పంద పత్రాలపై సంతకాలు జరుపుతారు
ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడుతారు. చివరగా యూఎస్ ఎంబసీలో ఈసీఓ రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది.

ఇక మథ్యాహ్నం మోదీతో లంచ్ లో పాల్గొంటారు, . అక్కడి నుంచి ట్రంప్ ఐటీసీ మౌర్య హోటల్ చేరుకొని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసే అవకాశం ఉంది… రాత్రి రాష్ట్రపతి ఇచ్చే విందులో పాల్గొంటారు. రాత్రి 10 గంటలకు తిరిగి అమెరికా బయలుదేరుతారు.