టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంచలన ఆరోపణలు..అందుకే కలెక్టరేట్ నిర్మాణం ఆలస్యం అంటూ..

0
38
Uttam Kumar Reddy

నల్గొండ ఎంపీ టీపీసీసీ మాజీ అధ్యక్షుడు కెప్టెన్ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సూర్యాపేట కలెక్టరేట్‌ను సందర్శించిన అనంతరం ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం హుజూర్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డికి ప్రతి ఏడాది కోటి రూపాయలు చెల్లిస్తున్నందున జిల్లా కలెక్టరేట్‌ నూతన భవన నిర్మాణంలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు.

సూర్యాపేట కలెక్టరేట్‌ కొత్త భవన నిర్మాణానికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి, కొందరు మంత్రులు అనుమతించడం లేదని ఆరోపించారు. 1 కోటి అద్దెను ప్రభుత్వం అతనికి అద్దెగా చెల్లిస్తోంది. ప్రస్తుత కలెక్టరేట్ చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామ సమీపంలోని కామాక్షి ఇంజినీరింగ్ కళాశాలలో ఉందన్నారు. ఈ భవనం పట్టణానికి దూరంగా ఉండి సామాన్య ప్రజలకు అసౌకర్యంగా ఉందన్నారు. ఏళ్ల తరబడి స్థానిక ప్రజలు భవన నిర్మాణాలకు పనికి రాకుండా పోయిందని ఫిర్యాదులు చేస్తున్నారని అయితే ఎమ్మెల్యే సైదిరెడ్డి, కొందరు మంత్రులు కొత్త కలెక్టరేట్‌ నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తున్నారని. పాతపడిన కళాశాల భవనానికి సంవత్సరానికి 1 కోటి అద్దె తీసుకుంటున్నారని ఆయన అన్నారు.

వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఘోర పరాజయాన్ని చవి చూస్తోందని, ఈ విషయాన్ని పసి గట్టిన టీఆర్‌ఎస్‌ నేతలు అన్ని రకాలుగా దోపిడీని చేశారని ఆరోపించారు. హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి భూ, ఇసుక, గనులు, వైన్స్‌ తదితర మాఫియాకు పాల్పదుతున్నారని తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ పరిస్థితి భిన్నంగా లేదు. ‘‘మద్యం హోల్‌సేల్‌ను కల్వకుంట్ల కుటుంబీకులు చేస్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు రిటైల్ గా చేస్తున్నారని అన్నారు. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ఏ బ్రాండ్‌లు కొనుగోలు చేయాలి, ఏ ధరకు, పరిమాణంలో కూడా నిర్ణయిస్తూ కల్వకుంట్ల కుటుంబం నెలకు వందల కోట్లు సంపాదిస్తోందని ఆరోపించారు. అదే విధంగా స్థానిక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని మద్యం షాపులన్నింటిని తమ ఆధీనంలోకి తీసుకుని నెలకు పదుల కోట్లు సంపాదిస్తున్నారు’’ అని ఆరోపించారు.

ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఎంపీగా పని చేసిన కాలంలో టీఆర్‌ఎస్‌లో సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు ఇంతటి సిగ్గులేని అవినీతిని చూడలేదు’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అక్రమ కార్యకలాపాలన్నింటికీ కలెక్టర్లు, పోలీసు ఎస్పీల నుంచి నేరుగా రక్షణ లభిస్తోందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వారు తమ వ్యవస్థీకృత మాఫియాల ద్వారా అమాయక ప్రజలను మరియు సాధారణ పౌరులను వేధిస్తున్నారని, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి మట్టంపల్లి మండలంలో గిరిజనుల 300 ఎకరాల భూమిని అక్రమంగా లాక్కున్నారని ఆయన వివరించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు స్థానిక జిల్లా అధికారులతో కుమ్మక్కై తమ నియోజకవర్గాల్లో అక్రమ ఆక్రమణలకు పాల్పడుతున్నారని అన్నారు.

తహసీల్దార్‌ నుంచి జిల్లా కలెక్టర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాల వరకు అవినీతికి పాల్పడుతున్నారని ఆయన అన్నారు. పోలీసు శాఖలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌, సర్కిల్‌, ఉన్నతాధికారుల వద్ద అవినీతి పెచ్చుమీరిందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ నేతల మాఫియా చర్యలతో ప్రజలు విసిగిపోయారని, కేసీఆర్‌ అవినీతి పాలనను అంతమొందించేందుకు త్వరలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువస్తారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.