70 రోజులకే వైసీపీలో భగ్గుమంటున్న విభేదాలు

70 రోజులకే వైసీపీలో భగ్గుమంటున్న విభేదాలు

0
35

అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చిలకలూరి పేట వైసీపీ నాయకుల మధ్య వర్గపోరు కొనసాగుతోంది… ఎన్నికలకు ముందు ఆఖరి నిమిషంలో ఎంటర్ అయిన విడుదల రజని ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యే అయ్యారు…

పార్టీ స్థాపించినప్పటినుంచి అన్నివిధాల అండగా ఉంటూ జిల్లా అధక్షుడిగా ఉన్న మర్రి రాజశేఖర్ పార్టీలో అయన రెండవ స్థానంలో కొనసాగుతున్నారు.,.. అయితే పార్టీలో క్యాడర్ మాత్రం అయనకు అలానే ఉంది. దాంతో పార్టీ సమాచారాలన్నీ ముందుగా ఆయనకే చేరేది ఇక ఇది కాస్త విడుదల రజనికి ఇబ్బందిగా మారింది..

దింతో ఆమె మర్రి వర్గీయులను దూరంగా పెట్టడంతో వారు వేరే కుంపటిని పెట్టారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జోక్యం చేసుకోకపోతే చిలకలూరి పేటలో పరిస్థితి చేజారి పోయే అవకాశం ఉందని అంటున్నారు..