విశాఖలో 10కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు….

విశాఖలో 10కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు....

0
34

ఏపీలో కరోనా వైరస్ మొదట్లో ఏపీపై అంత ప్రభావం చూపనప్పటికీ రెండు రోజులుగా రాష్ట్ర వాప్యంగా తన కొరలను చాచుతోంది… ఒక్కరోజులోనే సుమారు 21 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని డాక్టర్లు తెలిపారు… ఈ మేరకు హెల్త్ బులిటెన్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది…

పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంతవరకు ఒక్క కరోనా పాజిటివ్ కూడా నమోదు కాని నేపథ్యంలో తాజాగా ఒకే సారి 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి అలాగే విశాఖలో మరో నాలుగు కొత్త కేసులు నమోదు అయ్యాయి…

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అలర్ట్ అయ్యారు… అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవ్వరు బయటకు రాకూడదని చెబుతున్నారు… అలాగే ఒకే సారి పశ్చిమ గోదావరి జిల్లాలో 14 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు జిల్లావ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు…