వివాహ విందు ఏర్పాటు చేసినందుకు కేసు నమోదు….

వివాహ విందు ఏర్పాటు చేసినందుకు కేసు నమోదు....

0
37

ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దాన్ని అరికట్టేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారు.. ఎవరికైనా కరోనా లక్షణాలు వచ్చినట్లు అయితే జిల్లాల వారిగా టోల్ ఫ్రీ నంబర్లను కూడా విడుదల చేసింది…

కరోనా వైరస్ రోజు రోజుకు ఎక్కువ అవుతుండటంతో జిల్లాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు… అత్యవసర సేవలు మినహా ఎవ్వరు బయటకు రాకూడదని హెచ్చరిస్తున్నారు… ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని అంటున్నారు…

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తన సోదరుడు వివాహానికి విందు ఏర్పాటు చేశారు దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరిచారు… కేవలం ఐదుగురికి మాత్రమే విందు ఏర్పాటు చేయాలని నోటీసులు అందించారు.. కానీ ఆయన నిబంధనలకు వ్యతిరేకంగా సుమారు కొన్ని వందల మందికి విందును ఏర్పాటు చేశారు… దీంతో అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు…