వైసీపీ కంచుకోటలో మొదలైన వార్…. టెన్షన్ టెన్షన్

వైసీపీ కంచుకోటలో మొదలైన వార్.... టెన్షన్ టెన్షన్

0
35

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట కడప జిల్లా…. ఆ తర్వాత జిల్లా కర్నూల్ జిల్లా 2014 ఎన్నికల్లో 14 అసెంబ్లీ స్థానాలకు 11 స్థానాలను కైవసం చేసుకుంది వైసీపీ… ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసుకుంది….అలాంటి జిల్లాలో తాజాగా పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది…

రాళ్లు కర్రలతో దాడులు చేసుకున్నారు…స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వర్గానికి చెందిన భాస్కర్ అలాగే శేఖర్ వర్గాలు రెండుగా విడిపోయి దాడులు చేసుకున్నారు.. నగరంలో రెండురోజులుగా మంచినీటి సరఫరా ఆగిపోయింది…

దీన్ని శేఖర్ వర్గీయులు రిపేర్ చేస్తుండగా భాస్కర్ వర్గీయులు వచ్చి అడ్డుకున్నారు… నగరంలో ఎలాంటి పనులనైనా చెపట్టాల్సింది తామేనన శేఖర్ వర్గీలు బెదించారు…

కాదంటే చంపేస్తామని హెచ్చరించారు… దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం మొదలై ఘర్షణ వరకు దారితీసింది… ఈ క్రమంలో భాస్కార్ వర్గీయులు కట్టెలు రాళ్లతో దాడులు చేయడంతో శేఖర్ వర్గీయులకు గాయాలు అయ్యాయి…