జగన్, కేసీఆర్ రహస్యాలు బట్టబయలు

జగన్, కేసీఆర్ రహస్యాలు బట్టబయలు

0
165

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర పరిపాలనను వదిలేసి కక్ష సాదింపు ప్రతీకారం చుట్టు తిరుగుతున్నారని ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేం పార్టీ ఆరోపిస్తోంది…తాజాగా పార్టీ మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ మాట్లాడుతూ… ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు ఆయన ఒక ప్రకటన కూడా చేశారు… విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు రైతునుంచి పారిశ్రామిక వేత్తల వరకు అన్ని వార్గాలపై ఏపీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని రామ్మోహన్ ఆరోపించారు…

జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాలకన్నా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయోజనాలే పరమవాదిగా పనిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు… ప్రస్తుతం కేసిఆర్ ఆదేశాలను పాటిస్తూ రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయాన్ని చేకూర్చుతున్నారని రామ్మోహన్ మండిపడ్డారు…