శాసనమండలిపై జగన్ అదిరిపోయే వ్యూహం… ఇరకాటంలో టీడీపీ

శాసనమండలిపై జగన్ అదిరిపోయే వ్యూహం... ఇరకాటంలో టీడీపీ

0
33

శాసనమండలిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది… రాజధాని వికేంద్రీకరణ బిల్లు సీఆర్డీఏ బిల్లు శాసనమండలి చైర్మన్ షరీఫ్ సెలక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసింది… అయితే దీన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది..

మరోసారి శాసనమండలిని ప్రవేశపరచాలని భావిస్తున్నారు.. ఈమేరకు పార్టీ నేతలో మంత్రులతో ముఖ్యనేతలతో చర్చించిన జగన్ ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్నారు.. అలాగే కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు…

మండలికి సంబంధించి ఇవాల నిర్ణయం తీసుకోకపోతే సోమవారం కూడా అసెంబ్లీ సమావేశాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఈమూడు రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుని సోమవారం అసెంబ్లీలో ప్రకటించాలనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది…