తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్..డిగ్రీలో కొత్త కోర్సులు

0
44

తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే ఈసెట్, ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్‌ లింబాద్రి మీడియాతో మాట్లాడారు. వాయిదా పడ్డ ఈ సెట్, ఎంసెట్(అగ్రికల్చర్) తేదీలను త్వరలో ఖరారు చేస్తామని వెల్లడించారు. కనీసం వారం రోజులు ముందుగానే విద్యార్థులకు సమచారం ఇస్తామని పేర్కొన్నారు లింబాద్రి.

అలాగే ఈసారి డిగ్రీలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. కాకతీయ యూనివర్సిటీలో సోషియాలజీ (హానర్స్), సిటీ కాలేజ్ లో హిస్టరీ (హానర్స్) సిరిసిల్లలో ఫ్యాషన్ డిజైన్ కోర్సు, ఫారిన్ లాంగ్వేజెస్ కోర్స్ లను కూడా ప్రవేశ పెట్టామని ఆయన వెల్లడించారు.

దోస్త్ లో ఈ రోజు వరకు 60 వేలు మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీలలో ఈ విద్యా సంవత్సరం నుండి కొత్త ఫీజులు అమలులోకి వస్తాయని లింబాద్రి తెలిపారు. విద్యార్థులు ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ వైపుకే మొగ్గు చూపుతున్నారన్నారి లింబాద్రి తెలిపారు.