తిరుమల భక్తులకు అలెర్ట్..దర్శనానికి 25 గంటల సమయం

0
44

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భక్తులు  కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి దేశవిదేశాల నుండి భక్తులు అధికసంఖ్యలో తండోపతండాలుగా తరలివస్తున్నారు. దాంతో తిరుమల పరిసరప్రాంతాల్లో ఉండే కాంప్లెక్స్‌లు నిండిపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దీన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులకు అన్నప్రసాదం, తాగు నీరు, చంటి పిల్లల కోసం పాలు ఇవ్వడం వంటి ఆర్థిక సహాయాలు చేస్తూ కొంత మేరకు ఆదుకుంటున్నారు. ఇంకా క్రమక్రమంగా భక్తుల సంఖ్య అధికంగా పెరుగుతుండడంతో  దర్శనానికి బారులు తీరారు. దర్శనానికి 25 గంటల సమయం పడుతుండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

నిన్న శుక్రవారం 67,949 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 39,837 మంది తలనీలాలు సమర్పించినట్టు అధికారులు వెల్లడించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం 3.70 వచ్చిందని టీటీడీ వర్గాలు తెలిపాయి.