ఆన్‌లైన్‌లో రియల్ మనీ గేమ్స్​పై బెట్టింగ్​ పెడుతున్నారా? అయితే ఈ రూల్స్ పాటించాల్సిందే!

0
29

ఈ మధ్యకాలంలో ఆన్లైన్ గేమ్ లకు విపరీతంగా డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా యువత ఎక్కువ సమయాన్ని ఆన్‌లైన్ గేమ్‌లకు కేటాయిన్నారు. కొన్ని రకాల ఆన్‌లైన్ గేమ్స్‌తో డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. కొన్ని రకాల ఆన్ లైన్ గేమ్స్‌లను చట్టబద్ధం చేసి బెట్టింగ్ నిర్వహించుకోవచ్చని కోర్టులు స్పష్టం చేశాయి. అయితే నైపుణ్యానికి సంబంధించిన గేమ్​లలో గెలవాలంటే వ్యక్తి తన మేదస్సు‌ను పదును పెట్టాల్సి ఉంటుందని..అదే ఇతర గేమ్స్​లో గెలవాలంటే అది పూర్తిగా అదృష్టం మీద ఆధారపడి ఉంటుందని చట్టం పేర్కొంది.

ఫాంటసీ గేమ్స్ పూర్తిగా ఆటలో నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. దీంతో వీటిని కూడా చట్టబద్ధంగా అనుమతించారు. గేమింగ్ ల నిపుణుడు వైభవ్ కక్కర్ఫాంటసీ క్రీడలకు సంబంధించిన రూల్స్​ వివరించారు. ఫాంటసీ క్రీడలు ఆడేందుకు ప్రజలు లైసెన్స్ పొందవలసి ఉంటుందని తెలిపారు. ఫాంటసీ గేమ్స్ ద్వారా వచ్చే ఆదాయంలో బెట్టింగ్ 30% ఫ్లాట్ రేట్‌తో పన్ను విధిస్తారట. ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ. 10,000 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రైజ్ మనీని మీ ఖాతాలో క్రెడిట్ చేయడానికి ముందు 30% టీడీఎస్​ని తీసివేస్తారని వివరించాడు.

ఇక గ్యాంబ్లింగ్ విషయానికి వస్తే.. పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్, 1867 ద్వారా మన దేశంలో జూదాన్ని నిషేధించారు. అయితే, స్కిల్‌కు సంబంధించిన గేమ్స్‌లను ఈ యాక్ట్ నుంచి మినహాయింపు ఉంది.. ఇందు కోసం గత కొన్ని సంవత్సరాల నుంచి న్యాయపరంగా చర్చలు చేసి ఓ నిర్ణయం తీసుకున్నారు. ఫాంటసీ క్రీడలను స్కిల్ గేమ్స్‌గా వర్గీకరించారు. దీంతో ఇలాంటి గేమ్స్‌ను అందించే ప్లాట్ ఫారమ్‌లను మనదేశంలోనూ చట్టబద్ధంగా అనుమతించారు.
జూదంపై అనేక రాష్ట్రాల్లో ప్రత్యేక చట్టాలు చేశాయి. మరి కొన్ని రాష్ట్రాలు ఫాంటసీ క్రీడల వంటి ఆటలను నిషేధించాయి. గత ఏడాది అక్టోబర్ ‌లో జూదంతో పాటు ఫాంటసీ స్పోర్ట్స్‌ను క్లబ్‌లో చేర్చిన తర్వాత కర్ణాటక దీన్ని పూర్తిగా నిషేధించింది. అయితే,కర్నాటక హైకోర్టు మాత్రం ప్రభుత్వ నిర్ణయానికి భిన్నంగా గ్యాంబ్లింగ్‌పై నిషేధాన్ని ఎత్తివేసింది. కేవలం ఆంక్షలు విధించేలా ప్రభుత్వం చట్టాలను చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​​ రాష్ట్రాల్లోనే ఫాంటసీ గేమ్స్‌లపై నిషేధం అమల్లో ఉంది.