Breaking: ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్..రేపే ఫలితాలు విడుదల

0
162

ఏపీ పదవతరగతి విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా పదవతరగతి ఫలితాలు శనివారం నాడు అంటే రేపు విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ ఫలితాలను విడుదల చేయనున్న క్రమంలో ఈ ఏడాది ఫలితాలు గ్రేడ్‌లకు బదులు మార్కుల రూపంలో వెలువడనున్నాయి.