టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై..నేడు మ్యాచ్ ఎక్కడ జరగనుందో తెలుసా?

0
45

మార్చి 26 నుండి ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే. ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు ప్రేక్షకులను ఉత్సహపరిచాయి. ఇప్పటికే 60 మ్యాచ్‌లు పూర్తి అయిపోయి..ఇవాళ 62 మ్యాచ్ లో తలపడానికి చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ రెడీగా ఉన్నారు. ఈ మ్యాచ్‌ ముంబై లోని వాంఖడే స్టేడియం లో మధ్యాహ్నాం 3:30 గంటలకు జరగనున్న నేపథ్యంలో చెన్నై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

ఇరు జట్ల వివరాలివే..

గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ

చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, శివమ్ దూబే, ఎన్ జగదీశన్, MS ధోని, మిచెల్ సాంట్నర్, ప్రశాంత్ సోలంకి, సిమర్‌జీత్ సింగ్, మతీషా పతిరణ, ముఖేష్ చౌదరి