నేటినుంచి శ్రీ కాళహస్తిలో దర్శన వేళల్లో మార్పులు

Today Onwards Darshan time changes in Sri Kalahasti temple

0
36

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పెరుగుతున్న దృష్ట్యా జూన్ 1వ తేదీ ఉదయం 10 గం.ల నుండి ప్రభత్వము కర్ఫ్యూ విధించింది. దీంతో జూన్ 1వ తేదీ నుంచి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం లో కోవిడ్ 19 నిబంధనలకు లోబడి, భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ఆలయ దర్శన సమయంలో మార్పు చేయడమైనది. భక్తుల కోరిక మేరకు ఉదయం 6:00 గంటల నుండి ఉదయం 9:00 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనమునకు అనుమతించబడును. ఉదయం 6 గం.ల నుండి ఉదయం 9 గం.ల వరకు రాహు కేతు పూజలకు భక్తులను అనుమతించబడును. మిగిలిన ఆర్జిత సేవలన్నియు కోవిడ్ నిబంధనల మేరకు ఏకాంతముగానే నిర్వహించ బడును. ఆర్జిత సేవలలో భక్తులకు అనుమతి లేదు.

అదేవిధముగా ఈ కోవిడ్ సందర్భములో భక్తుల ఆరోగ్యం దృష్ట్యా, భక్తుల సౌకర్యం కొరకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ శాఖ కమీషనరు సూచనల మేరకు ఆన్ లైన్ లో పరోక్ష పద్ధతి ద్వారా భక్తులు పూజలు జరిపించుకొనుటకు రాహు కేతు పూజతో సహా 12 రకములైన సేవలను ప్రవేశ పెట్టియున్నారు.

భక్తులందరూ ఈ ఆన్ లైన్ సేవల ద్వారా వారికి కావలసిన సేవలకు అవసరమైన రుసుమును ఆన్ లైన్ ద్వారా చెల్లించి వారి పేరు మరియు గోత్ర నామములతో పూజలు జరిపించుకొను విధముగా ఏర్పాట్లు చేయబడినది. పరోక్ష సేవలకు సంబంధించిన వివరములు దేవస్థానం ఫోన్. 08578-222240 ద్వారా తెలుసుకొనవచ్చును. ఈ విషయమును భక్తులు గమనంలో ఉంచుకోవాలని దేవేస్థానం సిఇఓ ఒక ప్రకటనలో తెలిపారు.