దారుణం… డాక్టర్ గొంతు కోసి హత్య చేసిన దుండగులు…

దారుణం... డాక్టర్ గొంతు కోసి హత్య చేసిన దుండగులు...

0
44

మహిళ రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా కూడా వారికి రక్షణ లేకుండా పోయింది.. ఇటీవలే కాలంలో మహిళలపై వేధింపులు, హత్యలు ఎక్కువ అవుతున్నాయి… తాజాగా చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది.. కొందరు వ్యక్తులు ఒక మహిళ గొంతు కోసి హత్య చేశారు…

ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కొత్తపేటలో ఆర్ ఎంపీ వైద్యురాలుగా కృష్ణవేణిని హత్యకు గురి అయింది… రాత్రి ఆమెను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు.. ఆమె ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో ఈ దారుణం జరిగింది…

మరుసటి రోజు ఉదయం పనిమనిషి ఇంటికి రావడంతో ఈ హత్య ఉదాంతం బయటకు వచ్చింది… సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని మృత దేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…