కూతు‌రుకి మూడు పెళ్లిళ్లు చేసి ఆస్తులు కూడ‌బెట్టింది చివ‌ర‌కు ఏమైందంటే

కూతు‌రుకి మూడు పెళ్లిళ్లు చేసి ఆస్తులు కూడ‌బెట్టింది చివ‌ర‌కు ఏమైందంటే

0
39

పరంజ్యోతి అనే మ‌హిళ చూడ‌టానికి చాలా అందంగా ఉంటుంది.. అయితే స‌క్క‌గా పెళ్లి చేసుకుని సంసారం చేసుకుని ఉండాల్సిన ఆమెకి, అలాగే ఆమె త‌ల్లికి ఓ పాడు బుద్ది వ‌చ్చింది, త‌ల్లి వంట మాస్ట‌ర్ ద‌గ్గ‌ర కూర‌గాయలు కోసే ప‌నికి వెళ్లేది, ఇక కూతుర్ని డిగ్రీ చ‌దివించింది, భ‌ర్త పెళ్లి అయిన రెండేళ్ల‌కి వ‌దిలెయ్య‌డంతో ఒంట‌రిగా కూతురితో ఉంటోంది.

ఈ స‌మ‌యంలో ఆమె కూతురికి ధ‌న‌వంతుల సంబంధం చూసి పెళ్లి చేయాలి అని భావించింది, ఇక అమ్మాయి బాగుండ‌టంతో బ్యాగ్రౌండ్ చూడ‌కుండా పెళ్లి చేసుకున్నాడు అర్జున్, కాని అత‌నికి పెళ్లి అయిన నెల‌కే న‌ర‌కం చూపించింది. చివ‌ర‌కు అత‌నితో విడాకులు తీసుకుని భ‌ర‌ణం తీసుకుంది.

ఇలా వ‌చ్చిన క‌ట్నంతో ఎవ‌రికి తెలియ‌కుండా ఊరు మార్చి మ‌రో వ్యక్తితో వివాహం చేసుకుంది, అక్క‌డా ఇదే సీన్, ఏకంగా కెన‌డా వెళ్లి, అక్క‌డ కేసుల పెట్టి ఇండియా వ‌చ్చింది, చివ‌ర‌కు పంజాబ్ లో ఓ స్టీల్ ఏజెన్సీ వ్యాపారి కుమారుడ్ని జ‌న‌వ‌రిలో వివాహం చేసుకుంది.. అత్తింటివారు క‌ట్నం కోసం వేధిస్తున్నారు అని కేసు పెట్టింది.. దీంతో ఆమె హిస్ట‌రీ పోలీసులు చెక్ చేస్తే ఈ సీన్ తెలిసింది, దీంతో ఆ పెళ్లి కొడుకు ఆమెని విడాకులు కోరుతున్నాడు, ఇలా అమ్మ కూతురు మొత్తం 4 కోట్ల వ‌ర‌కూ భ‌ర‌ణం లాగేశార‌ట‌.