తిరుమలకు పోటెత్తిన భక్త జనం.. స్వామివారి దర్శనానికి 15 గంటలు

0
44

తిరుమల శ్రీవారి దర్శనానికి  దేశ విదేశాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్న క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక సంఖ్యలో  తరలిరావడంతో తిరుమల కొండ భక్త జనంతో కిటకిటలాడుతూ దర్శనం కోసం 15 గంటలు ఎదురుచూడవలసి వస్తుంది. భక్తులు సర్వదర్శనం కోసం లైన్లలో గంటలు గంటలు వేచి చూడడంతో పాటు అక్కడ రూమ్ లు దొరకక నానాతిప్పలు పడవలసిన పరిస్థితి ఏర్పడింది.