ఇలాంటి గేమ్స్ ఆడితే మీ బ్యాంక్ లో ఉన్న మనీ లూటీ…

ఇలాంటి గేమ్స్ ఆడితే మీ బ్యాంక్ లో ఉన్న మనీ లూటీ...

0
37

అమలాపురం స్థానిక గణపతి థియేటర్ సమీపంలో ఓ బాలుడు సరదాగా తల్లి స్మార్ట్ ఫోన్ నుంచి ఆడిన ఆన్ లైన్ గేమ్ తో రూ 5.40 లక్షల దోపిడీకి గురై ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోయింది.తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో.. ఈ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో అర్థం కాక ఆ బాలుడు తల్లి తల్లడిల్లిపోతుంది.అమలాపురం పట్టణ పోలీసులకు బాలుడు తల్లి చెప్పిన వివరాలతో ఈ ఆన్‌లైన్ గేమ్ మోసంలో మరిన్ని కొత్త కోణాలు వెలుగు చూశాయి.

ఆ బాలుడు తన తల్లి స్మార్ట్ ఫోన్తో ఆన్ లైన్ క్లాసులో పాల్గొంటూనే ఖాళీ సమయాల్లో సరదాగా ఆన్‌లైన్ గేమ్ లోనికి వెళ్లాడు. 2o రోజులుగా ఆ గేములు ఆడుతున్నాడు ఫ్రీ ఫైర్ అనే ఆన్‌లైన్ గేమ్ యాప్ ను ఓపెన్ చేశాడు. అందులో వెపన్స్ కొనాలంటే పలానా లింక్ ఓపెన్ చేయమంటే అది కూడా ఓపెన్ పనిచేశాడు.అందులో ఈ గేమ్ యాప్ నిర్వాహకులు తెలివిగా తొలుత వెపన్స్ రూ. వంద నుంచి ధర చూపించాడు. ఓటీపీ అడిగినప్పుడు అది కూడా టైప్ చేశాడు.అలా ఒక్కసారి లింకు ఓ పనిచేస్తే మన బ్యాంక్ అకౌంట్ల విషయాలన్నీ అవతల వారికి తెలిసే ప్రక్రియ అందులో ఉంటుంది.

రూ వంద తో మొదలైన వెపన్స్ కొనుగోలు రూ 5000 వరకు ధరలతో బాలుడి తన స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయడంతో తన తల్లికి సంబంధించిన రెండు బ్యాంకు అకౌంట్ల నుంచి 20 రోజుల్లో మొత్తం రూ 5.4o లక్షలు డ్రా అయ్యాయి.తల్లి ఏదో అవసరం పడి ఎటిఎంకు వెళ్లి 15 వేలు డ్రా చేసేందుకు పిన్ కొడితే డబ్బులు రాలేదు.తర్వాత రెండు బ్యాంక్ లకు వెళ్లి ఆరా తీస్తే రెండో అకౌంట్లో డబ్బులన్నీ డ్రా అయినట్లు చెప్పడంతో ఆమెకు చెమటలు పట్టాయి.

అయితే గే మారినప్పుడల్లా డబ్బులు డ్రా అయినట్టు స్మార్ట్ ఫోన్ కు మెసేజ్ లు వస్తున్న అవి గజిబిజిగా ఉండటంతో అంతగా చదువుకోని ఆమె పెద్దగా దృష్టి పెట్టలేకపోయింది.పోలీసులు ఈ కేసు సైబర్ నేరం కింద వస్తుందా? రాదా ? అనే దానిపై సైబర్ నేరాల నిపుణులతో సంప్రదిస్తున్నారు.