తండ్రిపై పగతో కూతుర్ని దారుణంగా హత్య చేశారు..

తండ్రిపై పగతో కూతుర్ని దారుణంగా హత్య చేశారు..

0
32

తమిళనాడులో దారుణం జరిగింది… ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై కొందరు వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు… ఆ బాలిక ఎంత ప్రాదేయ పడినా కూడా కఠినాత్ములు కనికరం లేకుండా దారుణంగా కాల్చి వేశారు… దీంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు…

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది… అల్లుపురం పట్టణ సమీపంలో సినమదురాయ్ గ్రామానికి చెందిన జయబాల్, కుమార్ సోదరులకు అలాగే మురుగన్ కు మధ్య ఒక ఎకరం భూమి విషయంలో గొడవలు నడుస్తున్నాయి… ఈ క్రమంలో మురుగన్ తన స్నేహితుడిని జయబాల్ కిరాణా షాపుకు పంపించాడు…

అక్కడ జయబాల్ కుమారుడు ఉన్నాడు… అతనిపై మురుగన్ స్నేహితుడు దాడి చేశాడు…. దీంతో జయబాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తన మీదే ఫిర్యాదు చేస్తావా అని కోపం పెంచుకున్న మురుగన్… ఇంటి ముందు జయబాల్ కూతురు ఆడుకుంటున్న జయశ్రీపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయారు…