శ్రీవారి భక్తులకు శుభవార్త..టికెట్ల పెంపుపై టీటీడీ కీలక నిర్ణయం

0
35

తిరుమల భక్తులకు శుభవార్త. కోవిడ్ తగ్గుముఖం పడుతుండడంతో దర్శన టికెట్లు పెంపుపై టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది.ఇవాళ నుంచి ఆఫ్ లైన్ లో సర్వదర్శనం భక్తులకు 20 వేల టోకేన్లు జారి చేస్తుంది టిటిడి. అయితే భక్తులకు ఊరట కలిగించేలా ఈ సంఖ్యను పెంచనుంది. 20 వేల టికెట్ల నుండి 25 వేలకు ఆ సంఖ్యను పెంచనున్నట్లు టీటీడీ తెలిపింది. 24వ తేది నుంచి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను 25 వేలకు
టిటిడి పెంచింది. రేపు ఉదయం 9 గంటలకు పిభ్రవరి 24 నుంచి మార్చి 31వ తేదికి సంభందించిన టోకేన్లు ఆన్ లైన్ లో విడుదల కానున్నాయి.