యువతకు గుడ్ న్యూస్..భాగ్యనగరంలో భారీ జాబ్ మేళా..పూర్తి వివరాలిలా..

0
43

యువతకు గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్, గవర్నమెంట్ ఆఫ్  తెలంగాణ ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు సంబంధిత అధికారులు ప్రకటన విడుదల చేశారు.

ఈ నెల 28న హైదరాబాద్ శంషాబాద్ లోని మల్లికా ఏసీ కన్సెన్షన్ లో జాబ్ మేళాను నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా జాబ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ జాబ్ మేళాను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహించనున్నారు.

ఖాళీలు:

ఈ జాబ్ మేళా ద్వారా 80కి పైగా ప్రముఖ కంపెనీల్లో 7000లకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

విద్యార్హతల వివరాలు:

టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీఫార్మసీ, ఎంఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్స్, బీఈ, బీటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ చేసిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. ట్రాన్స్ జెండర్లు, చెవిటి, మూగ, దివ్యాంగులు కూడా ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించబడునని ప్రకటనలో పేర్కొన్నారు. ఇతర ఏదైనా సందేహాలుంటే 9030047304 (Only Whatsapp), 7097655912 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.