గోమాతని పూజిస్తే ఎంతో పుణ్యం- ఆ గోమాతలో ఉన్న దేవతలు ఎవరంటే

-

మన దేశంలో గోమాతని ఎంతో పూజిస్తాం, ఆవు కనిపించగానే వెంటనే దానికి చాలా మంది ఆహారం పెడతారు మొక్కుతారు, అయితే గోవుని పూజించడం వల్ల ఎన్నో ఫలితాలు ఉంటాయి, ఎలాంటి సిరిసంపదలు రావాలి అన్నా గోపూజ ఎంతో మంచిది, విజయాలు వస్తాయి ఆ ఇంటికి.

- Advertisement -

గోమాతలో సమస్త దేవతలు ఉన్నారు అని చెబుతారు మన పెద్దలు
గోవు పాదాల యందు – పితృదేవతలు ఉంటారు
కాళ్ళ యందు – సమస్త పర్వతములు ఉంటాయి
భ్రూమధ్యమున – గంధర్వులు ఉంటారు
గోవు దంతముల యందు – గణపతి ఉంటాడు
ముక్కున – శివుడు ఉంటాడు
ముఖమున – జ్యేష్ఠాదేవి ఉంటుంది
కళ్ళయందు – సూర్యుడు ఉంటాడు
గోవు చెవుల యందు – శంఖు చక్రములు ఉంటాయి
కంఠమునందు – విష్ణుమూర్తి ఉంటాడు
భుజమున – సరస్వతి ఉంటుంది
రొమ్మున – నవ గ్రహములు కొలువై ఉంటాయి
వెన్నులో – వరుణ దేవుడు , అగ్ని దేవుడు ఉంటారు
తోక యందు – చంద్రుడు ఉంటాడు
చర్మమున – ప్రజాపతి ఉంటారు
గోవు రోమాల్లో- త్రిలోకాల్లోఉన్న దేవతలు ఉంటారు

అందుకే గోవుని ఎక్కడా కొట్టకూడదు, గోపూజ చేసుకుంటే పాపాలు పోతాయి అని పురాణాల్లో కూడా తెలిపారు.. ఏ సమయంలో అయినా గోవులకు తృప్తిగా ఆహారము పెడితే సమస్త దేవతలకు ఆహారము పెట్టినంత పుణ్యఫలము కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Revanth Reddy | తెలంగాణకు బీజేపీ ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది.. రేవంత్ రెడ్డి సెటైర్లు..

తెలంగాణకు పదేళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని...

Janasena | ఇప్పుడే నీ పేరు మార్చుకో.. ముద్రగడకు జనసేన నేత వార్నింగ్..

పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకంటానంటూ ముద్రగడ...