లాక్ డౌన్ వేళ ఏపీలో దారుణం…

లాక్ డౌన్ వేళ ఏపీలో దారుణం...

0
36

ఒక వైపు ఏపీ వ్యాప్తంగా కరోనా వైరస్ కొరలు చాచుతుంటే మరో వైపు పెదకూరపాడు మండలం కాశిపాడులో దారుణం జరిగింది… స్థానికంగా ఉన్న ఒక వ్యక్తిని కొందరు దుండగులు కొట్టి చంపారు… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

కాశిపాడుకు చెందిన రాధా కృష్ణ మూర్తి చిల్లర కొట్టు వ్యాపారం చేస్తున్నాడు… తాజాగా అతనిని కొందరు దుండగులు హత్య చేసి బంగారు ఆభరణాలను దోచుకేళ్లారు… ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించగా హత్యకు పాల్పడిన వ్యక్తి స్థానిక యువకుడు గోపిగా పోలీసులు గుర్తించారు…

ప్రస్తుతం గోపి పోలీసుల అదుపులో ఉన్నాడు.. అతని దగ్గర నుంచి బంగారు ఆభరణాలు నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.. మరి కొందరు వ్యక్తులు పరారిలో ఉన్నారు.. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు…