ప్రియురాలు శవాన్ని ఇంట్లోనే పాతిపెట్టిన ప్రియుడు.

ప్రియురాలు శవాన్ని ఇంట్లోనే పాతిపెట్టిన ప్రియుడు.

0
33

తనను నమ్మి వచ్చిన ఒక మహిళను దారుణంగా చంపి తన ఇంట్లోనే పాతి పెట్టాడు ఈ దారుణమైన సంఘటన కేరళలో జరిగింది.. 42 సంవత్సరాల సుచిత్ర అనే మహిళ ట్రైనీ బ్యూటీ షియన్ గా విధులు నిర్వహిస్తోంది… మార్చి 17న తన మామయ్యకు బాగోలేదని సెలవుమీద వెళ్లింది..కుటుంబ సభ్యులకు ఏమో తనను ట్రైనింగ్ మీద ఎర్నాకుళం పంపిస్తున్నారని చెప్పింది… ఐదురోజులు అయినా సుచిత్ర ఫోన్ చేయకపోవడంతో అనుమానం వచ్చి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు…

మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు… ఈ దర్యాప్తులు పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి మానాలీకి చెందిన కీ బోర్డు ప్లేయర్ సుచిత్రకు సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యడని దర్యాప్తులో తేలింది..

కీ బోర్డు ప్లేయర్ ప్రశాంత్ ను కలవడానికి వెళ్లిందని తేలింది… దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు… తనను వివాహం చేసుకోవాలని సుచిత్ర ఒత్తిడి తీసువస్తుండటంతో ఆమెను హత్య చేశానని ఒప్పుకున్నాడు… తర్వాత ఆ శవాన్ని తాను ఉంటున్న ఇంట్లోను పాతి పెట్టానని తెలిపాడు..