మాస్క్ దరించలేదని కొడుకును హత్య చేసిన తండ్రి….

మాస్క్ దరించలేదని కొడుకును హత్య చేసిన తండ్రి....

0
42

ఈ సంఘటన కోల్ కతాలో జరిగింది… కరోనా విజృంబిస్తున్న తరుణంతో అక్కడి ప్రభుత్వం బయటకు వస్తే కచ్చితంగా మాస్కులు ధరించుకుని రావాలని తెలిపింది… లేదంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది… ఈ క్రమంలో కుమారుడు ఇంటినుంచి బటయకు వెళ్లేందుకు చూశాడు..

అయితే తండ్రి బయటకు వెళ్లాలంటే మాస్క్ పెట్టుకుని వెళ్లమని చెప్పాడు… కానీ కుమారుడు వినలేదు… కరోనాలేదు గిరోనా లేదు మనకు మస్క్ సెట్ అవ్వదని చెప్పాడు దీంతో గోపంలో తండ్రి మాస్క్ పెట్టుకుని బయటకు వెళ్లు లేదంటే ఇంట్లోకి రానివ్వని హెచ్చరించారు..

దీంతో తండ్రికుమారుడు మధ్య గొడవ పెద్దదైంది… ఇంట్లో నుంచి కాలు బయటపెడితే చంపేస్తానని అన్నాడు తండ్రి.. ఎందీ నన్ను చంపుతావా అంటు కుమారుడు తండ్రిమీదకు వెళ్లాడు దీంతో తండ్రి పీకపై టవల్ తో కట్టిగా బిగించి లాగాడు దీంతో ఊపిరాడక కుమారుడు మృతి చెందారు.. ప్రస్తుతం ఈ సంఘటన కలకలం రేపుతోంది.,..