ఏపీలో దారుణం తండ్రీ కొడుకు బాలికపై అత్యాచారం…

ఏపీలో దారుణం తండ్రీ కొడుకు బాలికపై అత్యాచారం...

0
33

కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది.. కూతురు వయసున్న ఓ బాలికను స్థానికంగా ఉంటున్న ఓ వృద్దుడు అత్యాచారం చేశాడు… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… కృష్ణా జిల్లా కలిదిండి మండలం గోపాలపురంలో జరిగింది ఈ దారుణం….

65 సంవత్సరాలు ఉన్న బ్రహ్మయ్య అలాగే ఆయన కుమారుడు 10 సంవత్సరాల కలిగిన తన కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డారని తల్లి ఫిర్యాదు చేసింది… తాను రొయ్యల ఫ్యాక్టరీలో పని చేస్తానని తన భర్త చేపల ఫ్యాక్టరీలో పని చేస్తారని తెలిపింది…

తన కుమార్తె పై అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమో డిమాండ్ చేసింది… ప్రస్తుతం ఆ బాలికను పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు… తల్లి ఫిర్యాదు మేరకు బ్రహ్మయ్య ఆయన కుమారుడుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది…