Home SPECIAL STORIES నిర్భయదోషులు జైల్లో నిరాహరదీక్ష ఎందుకో తెలుసా

నిర్భయదోషులు జైల్లో నిరాహరదీక్ష ఎందుకో తెలుసా

నిర్భయదోషులు జైల్లో నిరాహరదీక్ష ఎందుకో తెలుసా

0
190

మార్చి 3న నిర్బయ దోషులకి నలుగురికి ఉరిశిక్ష అమలు చేయాలి అని పటియాల కోర్టు తాజాగా డెత్ వారెంట్ విడుదల చేసింది. ఇక ముగ్గురికి కోర్టుకు వెళ్లే ఛాన్స్ లేదు, ఉరిశిక్ష రెండు సార్లు వాయిదాపడగా, ట్రయల్ కోర్టు మరోసారి డెత్ వారెంట్ జారీ చేసింది.

తాజాగా వినయశర్మ నిరాహరదీక్ష చేపట్టాడట, తాజాగా జైలు వర్గాలు ఈ విషయం తెలిపాయి.. కావాలనే వినయ్ శర్మ ఆహరం తీసుకోవడం లేదట.వినయ్ శర్మ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ, వినయ్ శర్మ మానసిక వ్యాధికి గురయ్యాడని, అలాంటి వ్యక్తిని ఉరితీయకూడదు అని చెప్పారు.

ఇక వినయశర్మ అన్నీ అవకాశాలు ఉపయోగించాడు…అన్నీ చోట్లా వ్యతిరేకత తీర్పు వచ్చింది..అక్షయ్ ఠాకూర్ మరోసారి రాష్ట్రపతి క్షమాభిక్ష కోరాలని నిర్ణయించుకున్నాడు. పవన్ గుప్తా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నాడు.ఇలా మరోసారి వీరి ప్రయత్నాలు వీరు చేయాలి అని చూస్తున్నారు.