నిర్భ‌య కేసులో ఉరి త‌ప్పించుకున్న మైన‌ర్ ఇప్పుడు ఎక్క‌డ ఉన్నాడో తెలుసా

నిర్భ‌య కేసులో ఉరి త‌ప్పించుకున్న మైన‌ర్ ఇప్పుడు ఎక్క‌డ ఉన్నాడో తెలుసా

0
38

చ‌ట్టాల‌లో లొసుగులు ద్వారా త‌ప్పించుకునే వారు చాలా మంది ఉన్నారు, త‌ప్పు చేసినా ద‌ర్జాగా కొద్ది శిక్ష అనుభ‌వించి త‌ర్వాత బ‌య‌ట‌ప‌డిపోతున్న వారు ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీ లో నిర్భయ రెండు వారాల పాటు మృత్యువు తో పోరాడి ప్రాణాలు వ‌దిలింది, ఇలా ఏ అమ్మాయికి ఇలాంటి ప‌రిస్దితి రాకూడ‌దు అని అంద‌రూ కోరుకున్నారు.

అయితే ఇందులో ఆరుగురు నిందితులు ఉన్నారు తీహ‌ర్ జైల్లో న‌లుగురికి ఉరిశిక్ష అమ‌లు అయింది మ‌రొక‌రు జైలులో ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోయాడు, కాని మ‌రో దుర్మార్గుడు మాత్రం ఈ కేసు నుంచి బ‌య‌ట ప‌డ్డాడు.

ఆ వ్యక్తి మైనర్ కావడంతో జువైనల్ యాక్ట్ కింద మూడేళ్ళ జైలు శిక్ష విధించి విడుదల చేశారు. అయితే నిర్భయ కేసులో మిగిలిన ఐదు మంది నిందుతుల ఫోటోలు బయటకి వచ్చినా కూడా ఆ మైనర్ ఫోటో ఒక్కటి కూడా బయటకి రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. అత‌ని ఫేస్ కూడా బ‌య‌ట పెట్ట‌లేదు
ఇప్పుడు అత‌ను సౌత్ లో ఓ స్టేట్ లో ఉంటున్నాడు అని తెలుస్తోంది. పైగా అత‌ను వంట‌వాడిగా ప‌ని చేస్తున్నాడ‌ట‌, ఇత‌నిపై ఎప్పుడూ పోలీసుల నిఘా ఉంటుంది అని తెలుస్తోంది.