ఎస్‌బీఐలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..రేపే చివరి తేదీ..పూర్తి వివరాలు ఇలా..

0
39

బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబయి ప్రధాన కేంద్రంగా పని చేసే ఈ బ్యాంక్‌ కాంట్రాక్ట్ విధానంలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తుల స్వీకరణకు గడువు గురువారంతో ముగియనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు: 04

వీటిలో చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్

టెక్నాలజీ ఆఫీసర్

పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖాళీల ఆధారంగా బ్యాచిలర్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.

వీటితో పాటు సంబంధిన పనిలో కనీసం 12 నుంచి 20 ఏళ్ల అనుభవం ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపికైన అభ్యర్థులను 5 ఏళ్ల కాంట్రాక్ట్ పీరియడ్‌ కోసం తీసుకోనున్నారు.

అభ్యర్థులను తొలుత పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తుల స్వీకరణకు గడువు రేపటితో (31-03-2022) ముగియనుంది.