నెలకు రూ. 30 వేల జీతం..పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌..పూర్తి వివరాలివే..

0
108

నిరుద్యోగులకు శుభవార్త..హైదరాబాద్‌ మల్కాజ్‌గిరికి చెందిన భరోసా సెంటర్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనుంది. పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు: 04 

వీటిలో లీగల్‌ సపోర్ట్‌ ఆఫీసర్‌

మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ ఏఎన్‌ఎం

డేటా ఎంట్రీ ఆపరేటర్‌ రిసెప్పనిస్ట్‌

అర్హతలు:

లీగల్‌ సపోర్ట్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎల్‌ఎల్‌బీ/ ఎల్‌ఎల్‌ఎంలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. కనీసం 2 ఏళ్ల అనుభవం తప్పనిసరి. వయసు 35-45 ఏళ్ల మధ్య ఉండాలి.

మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ ఏఎన్‌ఎం పోస్టులకు దరఖాస్తు చేసుకునే బీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి. అభ్యర్థుల వయసు 20-35 ఏళ్ల మధ్య ఉండాలి.

డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి. అవయసు 20-35 ఏళ్ల మధ్య ఉండాలి.

రిసెప్షనిస్ట్‌ పోస్టులకు ఇంటర్మీడియట్‌ అర్హత సరిపోతుంది. రెండేళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 20-35 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

*దరఖాస్తులను సైబరబాద్‌ కమిషనరేట్‌, గచ్చిబౌలిలో అందించాలి.

ఎంపికన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 15,000 నుంచి రూ. 30,000 వరకు చెల్లిస్తారు.

*దరఖాస్తుల స్వీకరణకు 24-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.