నెలకు రూ. 60 వేలకు పైగా జీతం..ప్రభుత్వాసుపత్రిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

0
37

ఏపీ: విజయవాడ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులను తీసుకోనున్నారు.

పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు: 17 

అర్హతలు..

వీటిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌

డార్క్‌ రూం అసిస్టెంట్‌

ఈసీజీ టెక్నీషియన్‌

స్పీచ్‌ థెరపిస్ట్‌

సిటీ టెక్నీషియన్‌ ఆడియో టెక్నీషియన్‌

ఆడియో టెక్నీషియన్‌

ఆప్టోమెట్రిస్ట్‌

ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్‌

డయాలసిస్‌ టెక్నీషియన్‌

పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా ఇంటర్మీడియట్‌, డిప్లొమా/ బీఎస్సీ, బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత కోర్సులో సర్టిఫికేట్లతో పాటు అనుభవం ఉండాలి.

ఏజ్ లిమిట్:

అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తులను సూపరిండెంట్‌, జీజీహెచ్‌, విజయవాడ, కృష్ణా జిల్లా, ఏపీ అడ్రస్‌కు పంపించాలి.

ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 12,000 నుంచి రూ. 61,960కి చెల్లిస్తారు.

దరఖాస్తుల స్వీకరణకు 31-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.