స్పేస్ కమిషన్ ఛైర్మన్​గా బాధ్యతలు చేపట్టిన సోమ్​నాథ్​..ఇస్రో ప్రకటన

0
43

డిపార్ట్​మెంట్​ ఆఫ్​ స్పేస్​ కార్యదర్శిగా, స్పేస్​ కమిషన్​ ఛైర్మన్​గా ఎస్​.సోమ్​నాథ్ బాధ్యతలు చేపట్టారు.​ ఈ విషయాన్ని ఇస్రో ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ బాధ్యతలు చేపట్టకముందు విక్రమ్​ సారాభాయ్ స్పేస్​ సెంటర్​ డైరక్టర్​గా సోమ్​నాథ్​ సేవలు అందించారు.

ఇప్పటికే జీఎస్​ఎల్వీ ఎంకే- 3 అభివృద్ధికి అందించిన సేవలకు గాను సోమ్​నాథ్​ టీమ్​ ఎక్స్​లెన్స్​ అవార్డు అందుకున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా మెరిట్​ అవార్డ్​, పర్ఫామెన్స్​ ఎక్సలెన్స్​ అవార్డ్​లతో ఇస్రో.. స్పేస్​ గోల్డ్​ మెడల్, నేషనల్​ ఏరోనాటిక్స్​ ప్రైజ్​తో ఆస్ట్రోనాటికల్​ సొసైటీ ఆఫ్​ ఇండియా (ఏఎస్​ఐ) సత్కరించాయి.

ప్రస్తుతమున్న ఇస్రో ఛైర్మన్ శివన్ అతి త్వరలోనే పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో.. సోమ్​నాథ్​ను ఆయన వారసుడిగా ఇటీవలే ఎంపిక చేసింది నియామకాల కేబినెట్ కమిటీ. టర్నేషనల్​ ఆస్ట్రోనాటికల్​ ఫేడరేషన్​ బ్యూరోలో సోమ్​నాథ్​ సభ్యుడిగా కొనసాగుతున్నారు.