తెలంగాణలో మరో దారుణం బాలికపై గ్యాంగ్ రేప్

తెలంగాణలో మరో దారుణం బాలికపై గ్యాంగ్ రేప్

0
26

దేశ వ్యాప్తంగా దిశ హత్యాచార ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే….. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు… అయితే ఈ ఘటన మరువక ముందే తెలంగాణలో మరో దారుణం జరిగింది…

కొమరంభీం జిల్లా జైనూర్ మండలం షేక్ గూడకు చెందిన ఓ బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు… ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది…. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది… ఒక బాలికను శ్రీకాంత్, ప్రభు అనే ఇద్దరు వ్యక్తులు కొద్దికాలంగా బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడుతున్నారు…

కొన్నిరోజులకు బాలిక గర్బం దాల్చడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లి గర్భశ్రావం చేయించారు…. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు… వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు…