టెన్త్ పరీక్షలు: తండ్రి పాస్..కొడుకు ఫెయిల్

0
47

మహారాష్ట్ర పుణెలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకేసారి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. అయితే తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో తండ్రి పాస్​ కాగా.. కొడుకు ఫెయిల్​ అయ్యాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

అయితే తన ఫలితాలపై సంతోషంగా ఉన్నా..కుమారుడు రెండు పేపర్లలో ఫెయిల్​ అయ్యాడని బాధగా ఉందన్నాడు అతని తండ్రి భాస్కర్​. సప్లిమెంటరీ పరీక్షల కోసం తన కొడుకుకు సాయం చేస్తానని చెప్పాడు. పుణెలో ప్రైవేట్​ సంస్థలో పని చేస్తానని.. రోజూ పని పూర్తయ్యాక వచ్చి పరీక్షలకు చదువుకునే వాడినని భాస్కర్​ చెప్పాడు.

“నేను ఎంతో చదవాలి అనుకున్నాను. కానీ కుటుంబ బాధ్యతలు తీసుకుని మధ్యలోనే చదువును ఆపేశాను. చదువును కొనసాగిస్తే మరింత సంపాదించొచ్చు అనుకొని.. పది పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాను. నా కుమారుడు పదో తరగతి చదువుతుండడం వల్ల నాకు సహాయం చేసేవాడు అని భాస్కర్ తెలిపాడు.