తల్లి అక్రమ సంబంధం… కుమారులు ఏం చేశారంటే…

తల్లి అక్రమ సంబంధం... కుమారులు ఏం చేశారంటే...

0
41

అక్రమ సంబంధం ఒక వ్యక్తి ప్రాణం తీసింది… ఈ దారుణం కృష్ణా జిల్లాలో జరిగింది… పల్లిపాలెంకు చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన సుశీల అనే వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఘర్షణ కూడా చేసుకున్నారు… గ్రామంలో పెద్ద పంచాయితీ పెట్టి పరిష్కరించారు…

అయినా కూడా వెంటేశ్వర్లు తన అక్రమ సంబంధానికి ముగింపు పలుకలేదు… ఇటీవలే సుశీలకు వెంకటేశ్వర్లుకు చిన్న చిన్న గొడవలు వచ్చాయి… ఇక ఇదే అదునుగా చేసుకున్న సుశీల కుమారులు పథకం ప్రకారం వెంకటేశ్వర్లును తల్లి ద్వారా ఇంటికి రప్పించుకుని గొడవకు దిగారు…

సుశీల కుమారులు నాని దుర్గప్రసాద్ లో కర్రలతో కొట్టి కరకట్టవద్ద వదిలేశారు విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు కుమారుడు తండ్రిని ఆసుపత్రికి తరలించారు… అయితే రోడ్డు మార్గమాధ్యమంలోనే మరణించినట్లు డాక్టర్లు చెప్పారు… వెంకటేశ్వర్లు కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు…