తిరుమల కిటకిట..శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

0
34

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భక్తులు  కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి దేశవిదేశాల నుండి భక్తులు అధికసంఖ్యలో తండోపతండాలుగా తరలివస్తున్నారు. దాంతో తిరుమల పరిసరప్రాంతాల్లో ఉండే కాంప్లెక్స్‌లు నిండిపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశ్యంతో  భక్తులకు అన్నప్రసాదం, తాగు నీరు, చంటి పిల్లల కోసం పాలు ఇవ్వడం వంటి ఆర్థిక సహాయాలు చేస్తూ కొంత మేరకు ఆదుకుంటున్నారు.

ఇంకా క్రమక్రమంగా భక్తుల రద్దీ అధికంగా పెరగడంతో శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి సర్వదర్శన భక్తులకు దర్శనానికి  18 నుంచి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. మొక్కులున్న భక్తులు అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో కాలినడకన భారీగా తిరుమలకు వస్తున్నారు. కాగా  నిన్న హుండీకి రూ. 4.44 కోట్లు ఆదాయం వచ్చిందని అధికారులు స్పష్టం చేసారు.