విషాదం – కడుపులో పిండాన్ని పూల కుండీలో పూడ్చిపెట్టిన – గర్భిణీ కన్నీటి కథ

విషాదం - కడుపులో పిండాన్ని పూల కుండీలో పూడ్చిపెట్టిన - గర్భిణీ కన్నీటి కథ

0
43

మహిళ ఎన్నో ఆశలతో ఉంటుంది… తన బిడ్డ ఈ లోకంలోకి రావాలని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకోవాలి అని  కోరుకుంటుంది. పాపం ఓ మహిళ గర్భవతి అయింది.. అయితే 14 వారాలకు తన బిడ్డ కడుపులోనే చనిపోయింది.

 ఆమె గర్భం నుంచి పిండాన్ని తొలగించారు. ఆమె కోరిక మేరకు ఆ పిండాన్ని ఆమెకే అప్పగించారు.
ఇక ఈ దారుణమైన ఘటన ఆమె తట్టుకోలేకపోయింది, తనతో జీవితాంతం బిడ్డ ఉండాలి అని భావించింది.. అందుకే ఆ పిండాన్ని నాలుగు రోజులు ఫ్రిజ్ లో పెట్టింది..సెలైన్ లో ఉంచింది, ఇక చివరకు అది పాడవుతుంది అని పెద్దలు చెప్పడంతో ఆమె దానిని ఓ పెద్ద కుండిలో వేసి మట్టి వేసి మొక్క నాటింది.
ఆ మొక్క ఎదుగుతూ ఉంటే నా కొడుకు ఎదిగినట్టే అని ఆమె చెబుతోంది, ఈ ఘటన అమెరికాలోని మిస్పోరీలో చోటుచేసుకుంది. ఆ పిండం కేవలం 26 గ్రాముల బరువు, 4 ఇంచుల పొడవు మాత్రమే ఉంది. పాపం గుండె సరిగ్గా పనిచేయక ఆ పిండం తీసేశారు అని తెలిపింది ఆమె.